ఇబ్బందుల్లో నటి.. వన్య ప్రాణుల మాంసం రుచి చూడటం వల్ల వీడియో

Updated on: May 06, 2025 | 5:15 PM

కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన 'లాపతా లేడీస్' చిత్రంతో నటి ఛాయా కదమ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆమె చుట్టూ వివాదం బిగుసుకుంది. ఛాయా కదమ్ రక్షిత జాబితాలోని వన్యప్రాణుల మాంసాన్ని తిన్నారన్న ఆరోపణలపై మహారాష్ట్ర అటవీ శాఖ విచారణ చేపట్టింది. ఈ ఆరోపణలు నిరూపితమైతే ఆమె చట్టపరమైన చిక్కులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ముంబైకి చెందిన ప్లాంట్ అండ్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విచారణ ప్రారంభమైంది. ఛాయా కదమ్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలను ఆధారం చేసుకుని థానే చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్‌కు పాస్ ఫిర్యాదు చేసింది.

వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం రక్షిత జాబితాలో ఉన్న కణితి, కుందేలు, అడవి పంది, ఉడుము, ముళ్ల పంది వంటి జంతువుల మాంసాన్ని తాను రుచి చూసినట్లు కదమ్ స్వయంగా చెప్పారని ఎన్జీవో తన ఫిర్యాదులో ఆరోపించింది. ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపి, నటితో పాటు ఈ వేటలో, మాంసం వినియోగంలో ప్రమేయం ఉన్న ఇతరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్జీవో కోరింది.ఎన్జీవో ఫిర్యాదును స్వీకరించిన మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు అధికారికంగా దర్యాప్తు ప్రారంభించారు. ఛాయా కదమ్‌కు సమన్లు జారీ చేశారు. ఈ ఆరోపణలపై లోతుగా దర్యాప్తు చేసేందుకు, వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కేవలం నటి చేసిన వ్యాఖ్యలకే పరిమితం కాకుండా, ఈ మాంసాన్ని సమకూర్చిన వేటగాళ్లు లేదా ఇందులో పాలుపంచుకున్న ఇతర వ్యక్తుల వివరాలను సేకరించడంపైనా ఈ బృందం దృష్టి సారించనుంది. ఈ కేసు దర్యాప్తు అధికారి రాకేష్ భోయిర్ మాట్లాడుతూ తాము కదమ్‌ను ఫోన్‌లో సంప్రదించామనీ అన్నారు. ప్రస్తుతం తాను ముంబైలో లేనని, నాలుగు రోజుల తర్వాత తిరిగి వస్తానని తెలిపారనీ న్యాయ సలహా తీసుకుంటున్నానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఆమె తమకు తెలియచేసారని అధికారి వివరించారు.

మరిన్ని వీడియోల కోసం :
వాడు నావాడంటే.. నావాడు అంటూ ఓ సీఐ కోసం పోలీస్‌స్టేషన్‌లో కొట్టుకున్న మహిళలు
ఆ శివలింగాన్ని నీటిలో ఉంచకపోతే.. అగ్ని ప్రమాదం సంభవిస్తుందా వీడియో

అడిగినంత పనీర్ వడ్డించలేదని పెళ్లి మండపంలో దారుణం వీడియో