62 ఏళ్ల వయసులో రెండో పెళ్లి.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

|

Jun 20, 2023 | 9:49 AM

62 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి పిల్లలకు తండ్రయ్యాడు. ఒకళ్ళకి, ఇద్దరికి కాదు ఏకంగా 3 పిల్లలకు తండ్రయ్యాడు. పెద్దాయన రెండో భార్య ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ఉచెహ్రా మండలం అతర్వేదియా ఖుర్ద్‌ గ్రామానికి చెందిన గోవింద్‌ కుష్వాహా

62 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి పిల్లలకు తండ్రయ్యాడు. ఒకళ్ళకి, ఇద్దరికి కాదు ఏకంగా 3 పిల్లలకు తండ్రయ్యాడు. పెద్దాయన రెండో భార్య ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ఉచెహ్రా మండలం అతర్వేదియా ఖుర్ద్‌ గ్రామానికి చెందిన గోవింద్‌ కుష్వాహా అనే 62 ఏళ్ల వ్యక్తి కొంతకాలం క్రితం హీరాబాయి కుష్వాహా అనే 30 ఏళ్ల మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో హీరాబాయి గర్భందాల్చగా రాత్రి సమయం లో ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో హుటాహుటీనా జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సిజేరియన్‌ చేసి హీరాబాయికి ప్రసవం చేశారు. ఆమె ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఒకేసారి ముగ్గురు పిల్లలకు తండ్రయ్యే సరికి అతని సంతోషానికి అవదులు లేవు. శిశువులు కాస్త బలహీనంగా ఉండటంతో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆదిపురుష్ ఎఫెక్ట్.. నేపాల్లో ఇండియన్ సినిమాకు దెబ్బ

రీల్స్‌ అంటే చచ్చేంత మోజు.. అదే అతని పాలిట శాపమైంది

Adipurush: ఆగని కాంట్రవర్సీ.. అక్కడ ఆదిపురుష్‌ బ్యాన్‌ !!

వీపులో మేకులు గుచ్చుకుని ట్యాక్సీ లాగిన అభిమాని !!

Adipurush: విమర్శలొద్దు.. ఓం రౌతే రైట్‌.. రావణుడు ఇలా ఉంటాడు..

 

Follow us on