మహిళను అమాంతం మింగేసిన కొండచిలువ !! పొట్ట చీల్చి..

Updated on: Nov 02, 2022 | 9:26 AM

ఓ మహిళను భారీ కొండచిలువ అమాంతం మింగేసింది. ఇండోనేషియాలోని జాంబీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఓ మహిళను భారీ కొండచిలువ అమాంతం మింగేసింది. ఇండోనేషియాలోని జాంబీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రతుకుతెరువు కోసం అడవిలో రబ్బరు ఏరేందుకు వెళ్లింది ‘జరా’ అనే ఓ 54 ఏళ్ల మహిళ. అయితే ఆమె మళ్లీ తిరిగి రాలేదు. అడవికి వెళ్లి రెండురోజులైనా ఆమె తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె భర్త అడవిలోకి వెళ్లి వెతికాడు. అడవిలో అతనికి ఓచోట జరా చెప్పులు, జాకెట్‌, హెడ్‌స్కార్ఫ్‌, కత్తి కనిపించాయి. వెంటనే అతను అధికారులకు సమాచారమిచ్చాడు. జరా భర్త సమాచారంతో సిబ్బందిని వెంటపెట్టుకుని అడవికి చేరుకున్న అధికారులు ఆ ప్రాంతానికి కొంత దూరంలో భారీ కొండచిలువను గమనించారు. దాని కడుపు బాగా ఉబ్బెత్తుగా కనిపించడంతో అధికారులకు అనుమానం వచ్చింది. అదృశ్యమైన జరాను అది మింగేసి ఉంటుందని భావించి దానిని బంధించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రిషి కుటుంబానికి గోల్డెన్‌ డేస్‌.. భార్య అక్షతా మూర్తికి బంపరాఫర్‌ !!

Published on: Nov 02, 2022 09:26 AM
Follow Us