ప్రాణం తీసిన స్టంట్‌ !! ఇలాంటి కార్యక్రమాలు నిషేధించాలంటూ నెటిజన్లు డిమాండ్‌

|

Oct 30, 2023 | 9:41 PM

పంజాబ్‌లోని గురుదాస్‌పుర్‌ జిల్లాలో నిర్వహించిన స్పోర్ట్స్‌ ఫెయిర్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. 29 ఏళ్ల సుఖ్‌మన్‌జీత్ సింగ్ అనే యువకుడు ట్రాక్టర్‌పై విన్యాసాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జిల్లాలోని తాతే గ్రామానికి చెందిన సుఖ్‌మన్‌దీప్‌ సింగ్‌ ట్రాక్టర్‌తో విన్యాసాలు చేస్తుంటాడు. ఆయన భార్య పంజాబ్‌ పోలీసు శాఖలో పనిచేస్తోంది. ఫతేగఢ్‌ ఛురియన్‌ నియోజకవర్గంలోని సర్చూర్‌ గ్రామంలో నిర్వహిస్తున్న రూరల్‌ క్రీడా పోటీల్లో సుఖ్‌మన్‌దీప్‌ కూడా పాల్గొన్నాడు.

పంజాబ్‌లోని గురుదాస్‌పుర్‌ జిల్లాలో నిర్వహించిన స్పోర్ట్స్‌ ఫెయిర్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. 29 ఏళ్ల సుఖ్‌మన్‌జీత్ సింగ్ అనే యువకుడు ట్రాక్టర్‌పై విన్యాసాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జిల్లాలోని తాతే గ్రామానికి చెందిన సుఖ్‌మన్‌దీప్‌ సింగ్‌ ట్రాక్టర్‌తో విన్యాసాలు చేస్తుంటాడు. ఆయన భార్య పంజాబ్‌ పోలీసు శాఖలో పనిచేస్తోంది. ఫతేగఢ్‌ ఛురియన్‌ నియోజకవర్గంలోని సర్చూర్‌ గ్రామంలో నిర్వహిస్తున్న రూరల్‌ క్రీడా పోటీల్లో సుఖ్‌మన్‌దీప్‌ కూడా పాల్గొన్నాడు. అక్కడ తాను నడుపుతోన్న ట్రాక్టర్‌తో రకరకాల విన్యాసాలు ప్రదర్శించాడు. ఇందులో భాగంగా ట్రాక్టర్‌ ముందు చక్రాలను గాల్లోకి లేపి కిందకి దిగాడు. అనంతరం ఆ వాహనం గుండ్రంగా గింగిరాలు తిరుగుతుండగానే టైరు మీద కాలుపెట్టి డ్రైవరు సీట్లోకి వెళ్లేందుకు సాహసించాడు. ఈ క్రమంలో అదుపుతప్పి వెనుక చక్రాల కింద పడిపోయాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తను చనిపోతూ 48 మంది ప్రాణాలను కాపాడిన బస్సు డ్రైవర్

పాక్‌ నుంచి భారత్‌కు రానున్న అంజు.. మీడియాకు తెలిపిన ఆమె భర్త నస్రుల్లా

ఆరున్నర కోట్ల ఉద్యోగం వదిలేశాడు.. ఆ తర్వాత ??

ఆస్తి కోసం ఓ పోలీసు చేసిన నిర్వాకం.. భార్య చనిపోయిందంటూ దొంగ డెత్‌ సర్టిఫికెట్‌..

సత్తాచాటిన ప్యాపిలి కుర్రాడు.. నరేంద్రమోదీ ప్రశంసలు..

 

Follow us on