ప్రతి భక్తుడికీ ఉచిత లడ్డూ ప్రసాదం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు విజయదశమితో ముగిశాయి. చివరి రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీతో దర్శనానికి ఆరు గంటలకు పైగా సమయం పడుతోంది. పది రోజుల్లో 11 లక్షల మందికి పైగా దర్శనం చేసుకోగా, ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూ ప్రసాదం అందిస్తున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన దసరా నవరాత్రులు విజయదశమితో ఘనంగా ముగిశాయి. చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విజయదశమి కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగి, దర్శనానికి ఆరు గంటలకు పైగా సమయం పట్టింది. భక్తుల సౌకర్యార్థం 60 కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేయగా, అవి నిండిపోయాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విశాఖలో ట్రావెల్స్ బస్సులపై RTA స్పెషల్ డ్రైవ్
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ డివైన్ మ్యూజిక్ సర్టిఫికేట్ కోర్స్
అరసవల్లిలో అద్భుత దృశ్యం.. మూల విరాట్టును తాకిన సూర్యకిరణాలు
