Hyderabad: చెడ్డీ గ్యాంగ్.. అంతకమించి.. వీడు వేరే లెవెల్ దొంగోడు రాజా..
పోలీసులకే రక్షణ లేకుండా పోయింది. తన ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ను దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. బైక్ పోయిందని పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి.
పాపం.! పోలీసులకే రక్షణ లేకుండాపోతోంది. ఓ పోలీస్ కానిస్టేబుల్ తన ఇంటి ముందు బైక్ పెట్టుకోగా.. అది కాస్తా చోరీకి గురైంది. వివరాల్లోకి వెళ్తే.. కోఠి ఇసామియా బజార్లో నివాసముంటున్న సుకుమార్ రెడ్డి అనే వ్యక్తి సిటీ ఏఆర్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. ఇక అతడు ఇంటి ముందు పార్క్ చేసిన తన బైక్ దొంగతనానికి గురైందని సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం అర్ధరాత్రి ఇసామియా బజార్లోని తన ఇంటి ముందు పార్క్ చేసిన యూనికార్న్ బైక్ను గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడని కంప్లయింట్లో పేర్కొన్నాడు. ఇక కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సుల్తాన్ బజార్ పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
పాతబస్తీలో రెచ్చిపోయిన ఆటోడ్రైవర్..
సింగరేణి ఖిల్లాలో 'అమెరికా' కోడలు
షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్న టెన్త్ విద్యార్ధినిలు..
సిరిసిల్లలో పులి పంజా.. రంగంలోకి హైదరాబాద్ బృందం
ప్రపంచ వేదికపై తెలుగు తేజం !! సిక్కోలు యువకుడి ఘనత
చూపు కోల్పోయిన 9 మంది.. వికటించిన కంటి వైద్యం
శ్రీశైలం మల్లన్నకు కాసుల వర్షం..13 రోజుల్లోనే ఏకంగా..

