పెయిన్ కిల్లర్స్ ప్రాణాంతకంగా మారుతున్నాయా
అధిక మోతాదులో పెయిన్కిల్లర్స్ వాడకం కాలేయం, మూత్రపిండాలతో సహా కీలక అవయవాలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. నైమిసులైడ్ వంటి కొన్ని మందులు ప్రాణాంతకం కాగా, కేంద్ర ప్రభుత్వం 100 ఎంజీ కంటే ఎక్కువ మోతాదు గల నైమిసులైడ్పై నిషేధం విధించింది. వైద్యుల సలహా మేరకు మాత్రమే పెయిన్కిల్లర్స్ వాడాలి.
నొప్పి, జ్వరం వంటి సాధారణ సమస్యలకు తక్షణ ఉపశమనం కోసం చాలామంది స్ట్రాంగ్ పెయిన్కిల్లర్స్ వైపు మొగ్గు చూపుతారు. అయితే, వీటిలో కొన్ని దీర్ఘకాలంలో ప్రాణాంతకమయ్యే అవకాశం ఉందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నైమిసులైడ్ వంటి మందులు ముఖ్యంగా కాలేయం, మూత్రపిండాలు, కడుపుపై తీవ్ర దుష్ప్రభావాలు చూపుతాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. లక్షణాలు వెంటనే కనిపించకపోయినా, అంతర్గతంగా తీవ్ర నష్టం జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, మద్యం సేవించే వారికి ఇది మరింత ప్రమాదకరం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
