Guntur: అర్ధరాత్రి ట్రైన్ ఒక్కసారిగా ఆగిపోయింది.. డౌట్ వచ్చి ప్రయాణీకులు లేచి చూడగా.. అమ్మబాబోయ్
పల్నాడు జిల్లాలోకి ట్రైన్ ఒక్కసారిగా ఎంటర్ అయింది. అది అర్ధరాత్రి సమయం.. ఏం జరిగిందో ఏమో.. దూసుకెళ్తున్న ట్రైన్ ఆగిపోయింది. నిద్రలో ఉన్న ప్రయాణీకులు ఠక్కున లేచి కూర్చున్నారు. ఈలోగా ఏదో అలికిడి.. ఆ వివరాలు ఏంటో..? ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..
పల్నాడు జిల్లా దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా రెండు రోజుల నుంచి రాత్రివేళ రైళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నారు. మంగళవారం రాత్రి నాగర్సోల్-నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో.. సోమవారం హైదరాబాద్-నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో చోరీలు జరిగింది. నడికుడి జంక్షన్ సమీపంలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో S1,S3 భోగిలో చోరీ చేశారు. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి ఆపిన నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో.. నిద్రిస్తున్న ప్రయాణికురాలి మెడలో ఉన్న 68 తులాల బంగారు గొలుసును దొంగలు లాక్కుని వెళ్లారు. S5 భోగిలోని ప్రయాణికులు శబ్దాలు విని ఒక్కసారిగా కేకలు వేయడంతో దొంగలు పారిపోయారు. దోచుకెళ్ళిన బంగారు ఆభరణాలు విజయవాడకు చెందిన ప్రయాణికురాలు శ్రీదేవివి కాగా.. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రైల్వే పోలీసులు. న్యూ పిడుగురాళ్ల, తుమ్మలచెరువు, నడికుడి, రైల్వే స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు.
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్కు గిఫ్ట్గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

