Guntur: అర్ధరాత్రి ట్రైన్ ఒక్కసారిగా ఆగిపోయింది.. డౌట్ వచ్చి ప్రయాణీకులు లేచి చూడగా.. అమ్మబాబోయ్
పల్నాడు జిల్లాలోకి ట్రైన్ ఒక్కసారిగా ఎంటర్ అయింది. అది అర్ధరాత్రి సమయం.. ఏం జరిగిందో ఏమో.. దూసుకెళ్తున్న ట్రైన్ ఆగిపోయింది. నిద్రలో ఉన్న ప్రయాణీకులు ఠక్కున లేచి కూర్చున్నారు. ఈలోగా ఏదో అలికిడి.. ఆ వివరాలు ఏంటో..? ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..
పల్నాడు జిల్లా దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా రెండు రోజుల నుంచి రాత్రివేళ రైళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నారు. మంగళవారం రాత్రి నాగర్సోల్-నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో.. సోమవారం హైదరాబాద్-నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో చోరీలు జరిగింది. నడికుడి జంక్షన్ సమీపంలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో S1,S3 భోగిలో చోరీ చేశారు. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి ఆపిన నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో.. నిద్రిస్తున్న ప్రయాణికురాలి మెడలో ఉన్న 68 తులాల బంగారు గొలుసును దొంగలు లాక్కుని వెళ్లారు. S5 భోగిలోని ప్రయాణికులు శబ్దాలు విని ఒక్కసారిగా కేకలు వేయడంతో దొంగలు పారిపోయారు. దోచుకెళ్ళిన బంగారు ఆభరణాలు విజయవాడకు చెందిన ప్రయాణికురాలు శ్రీదేవివి కాగా.. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రైల్వే పోలీసులు. న్యూ పిడుగురాళ్ల, తుమ్మలచెరువు, నడికుడి, రైల్వే స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు.
ప్రియురాలికి ప్రపోజ్ చేయబోతే రింగ్ జారిపడింది.. చివరకు..
మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్..
ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!
సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం
రీల్స్ సరదా.. నిండు ప్రాణం బలి
అర్ధరాత్రి పంటచేలో మంటలు.. ఏం జరిగిందంటే
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్

