విద్యార్థులకు మత్తు పదార్థాలు అలవాటు చేసి అకృత్యాలు

|

Mar 26, 2024 | 8:01 PM

తెలంగాణలో యువత రెచ్చిపోతున్నారు. గంజాయి మత్తులో మునుగుతూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. స్కూలుకు వెళ్లే మైనర్‌ బాలికలను టార్గెట్‌గా చేసుకొని రెచ్చిపోతున్నారు ఆకతాయిలు. ఇటీవలే జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు మత్తు పదార్ధాలు అలవాటు చేసి సెక్స్‌ రాకెట్‌ నడుపుతున్నారన్న వార్త కలకలం రేపింది. మైనర్‌ బాలికలకు మత్తు పదార్ధాలకు బానిసలను చేసి, వారిపై అత్యాచారాలకు పాల్పడుతున్నట్టు గుర్తించిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణలో యువత రెచ్చిపోతున్నారు. గంజాయి మత్తులో మునుగుతూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. స్కూలుకు వెళ్లే మైనర్‌ బాలికలను టార్గెట్‌గా చేసుకొని రెచ్చిపోతున్నారు ఆకతాయిలు. ఇటీవలే జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు మత్తు పదార్ధాలు అలవాటు చేసి సెక్స్‌ రాకెట్‌ నడుపుతున్నారన్న వార్త కలకలం రేపింది. మైనర్‌ బాలికలకు మత్తు పదార్ధాలకు బానిసలను చేసి, వారిపై అత్యాచారాలకు పాల్పడుతున్నట్టు గుర్తించిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వరంగల్‌ జిల్లాలో మరికొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకతాయిలు రెచ్చిపోయారు. గంజాయి మత్తులో తూగుతూ బైకులపై స్వైర విహారం చేస్తూ కాలేజీ నుంచి ఇంటికి వెళ్లే యువతులు, బాలికలను వేధింపులకు గురిచేస్తున్నారు. దుంపకుంట రోడ్డులో కాలేజ్‌నుంచి ఇంటికి వెళ్తున్న ఓ మైనర్‌ బాలికను వేధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయయ్యాయి. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ పుటేజ్‌ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లాకప్‌లో పేపర్లే ఇవ్వలేదు.. కేజ్రీవాల్‌ ఆదేశాలు ఎలా జారీ చేశారు ??

 

Follow us on