AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలలో కార్తీక శోభ

తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలలో కార్తీక శోభ

Phani CH
|

Updated on: Nov 05, 2025 | 3:38 PM

Share

కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయాలలో ప్రత్యేక పూజలు, కార్తీక దీపాలు వెలిగించారు. రాజమండ్రి, వేములవాడ, వరంగల్, శ్రీశైలం సహా పలు ప్రాంతాల్లో భక్తుల సందడి నెలకొంది. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని దేవాలయాలు కార్తీక శోభతో కళకళలాడుతున్నాయి.

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని దేవాలయాలు కార్తీక శోభతో కళకళలాడుతున్నాయి. ఈ పవిత్రమైన రోజున ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి, తమ ఇష్టదైవాలను దర్శించుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని గోదావరి నది ఒడ్డున ఉన్న పుష్కర్ ఘాట్‌కు వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. గోదావరిలో కార్తీక స్నానం ఆచరించి, పవిత్రంగా దీపాలు వదిలారు. పుష్కర్ ఘాట్, దాని పక్కనే ఉన్న కోటి లింగాల ఘాట్లు శివనామస్మరణతో మార్మోగాయి. ఘాట్ సమీపంలోని శివాలయాలలో శివుడికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Patna: పాట్నాలో భారీగా ట్రాఫిక్ జామ్

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్

ఎదురెదురుగా ఢీకొన్న RTC బస్సు, కారు

ఉమెన్‌ టీమిండియాపై సినీ సెలబ్రిటీల ప్రశంసల వ‌ర్షం..

Gold Price Today: గుడ్‌న్యూస్‌.. తగ్గుతున్న బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే ??