చంద్రుడి పైకి మీ బోర్డింగ్‌ పాస్‌! అవకాశం మిస్ కాకండి

Updated on: Sep 16, 2025 | 7:06 PM

భూమిని వదిలి వెళ్ళకుండానే చంద్రుని చుట్టూ ప్రయాణించాలనుకుంటున్నారా? అంతరిక్ష పరిశోధనలో పెద్ద ముందడుగు వేయడానికి సిద్ధమవుతున్న అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా.. సామాన్యులనూ భాగస్వాములను చేసేందుకు ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. 2026 ఏప్రిల్‌లోగా ప్రారంభం కానున్న ఆర్టెమిస్‌–2 మిషన్ లో భాగంగా ఓరియన్‌ అంతరిక్ష పరిశోధన నౌకలో వ్యోమగాములు చంద్రుని చుట్టూ ప్రదక్షిణ చేయనున్నారు.

వారితో పాటు ఓ మెమరీ కార్డు సైతం జాబిల్లిని చుట్టి రానుంది. ఈ మెమరీ కార్డ్‌లో చేర్చడానికి తమ పేర్లను సమర్పించాల్సిందిగా ప్రజలను నాసా ఆహ్వానిస్తోంది. చంద్రుడికో నూలుపోగు మాదిరిగా చంద్రుడి మీదకో ‘పేరు’ అన్నమాట. చరిత్రలో భాగం కావడానికి ఇది ఒక గొప్ప అవకాశం. 10 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో నాసా కొత్త స్పేస్‌ లాంచ్‌ సిస్టమ్, ఓరియన్‌ అంతరిక్ష నౌక పనితీరును అధ్యయనం చేస్తారు. వ్యోమగాములు భూమి నుంచి 2,30,000 మైళ్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తారు. తిరుగు ప్రయాణంలో చంద్రుని అవతలి వైపు తిరుగుతారు. ఈ దశాబ్దం చివర్లో చంద్రుని ఉపరితలంపై వ్యోమగాములను దింపడం, అలాగే మానవులను అంగారక గ్రహానికి పంపాలన్న నాసా ప్రయత్నంలో ఇది ఒక కీలకమైన అడుగు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాబోయ్.. రోడ్డుపై భారీ పైథాన్… ఆ తర్వాత జరిగిందిదే

భోపాల్‌ ‘90 డిగ్రీల’ వంతెనకు పోటీగా నాగ్‌పూర్‌ ‘బాల్కనీ ఫ్లైఓవర్‌’

క్షుద్ర పూజలకు విరుగుడు ఉందా? ఆ మంత్రానికి అంత శక్తి ఉందా?

30 పైసలకు పడిపోయిన కిలో ఉల్లి ధర.. రైతు ఆత్మహత్య

మెగా డీఎస్సీ ఎంపిక జాబితా విడుద‌ల‌..