గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్రం హెచ్చరిక
గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్రప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. సాధారణంగా ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం ఎక్కువశాతం గూగుల్ క్రోమ్ వాడతారు. వీరిక కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In), క్రోమ్ డెస్క్టాప్ వినియోగదారులకు ఓ హై-రిస్క్ హెచ్చరిక జారీ చేసింది. క్రోమ్ బ్రౌజర్ పాత వెర్షన్లలో కొన్ని తీవ్రమైన భద్రతా లోపాలను గుర్తించినట్లు, వీటి వల్ల యూజర్ల వ్యక్తిగత సమాచారం, ప్రైవసీ ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలిపింది.
ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో గూగుల్ క్రోమ్లోని లోపాలను ఆసరాగా చేసుకుని హ్యాకర్లు యూజర్ల అనుమతి లేకుండా వారి కంప్యూటర్ల నుంచి కీలక డేటాను దొంగిలించే ప్రమాదం ఉందని CERT-In తన నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా విండోస్, మ్యాక్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లలో క్రోమ్ డెస్క్టాప్ బ్రౌజర్ వాడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. CERT-In ప్రకారం, కొన్ని నిర్దిష్ట పాత వెర్షన్లు వాడుతున్న వారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది. 142.0.7444.59 కంటే ముందున్న గూగుల్ క్రోమ్ లైనక్స్ వెర్షన్లు, విండోస్ వెర్షన్లు, 142.0.7444.60 కంటే ముందున్న మ్యాక్ వెర్షన్లను వాడే వినియోగదారులు తక్షణమే తమ బ్రౌజర్ను లేటెస్ట్ వెర్షన్కు అప్డేట్ చేసుకోవాలని ఏజెన్సీ గట్టిగా చెబుతోంది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ను సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. ముందుగా మీ కంప్యూటర్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి, కుడివైపు పైన కనిపించే మూడు చుక్కల మెనూపై క్లిక్ చేయండి. ఆ తర్వాత ‘Help’ ఆప్షన్లోకి వెళ్లి, ‘About Google Chrome’ను ఎంచుకోవాలి. ఈ పేజీ ఓపెన్ అవ్వగానే, బ్రౌజర్ ఆటోమేటిక్గా కొత్త అప్డేట్ల కోసం చెక్ చేస్తుంది. అప్డేట్ అందుబాటులో ఉంటే, డౌన్లోడ్ పూర్తయ్యాక ‘Relaunch’ బటన్పై క్లిక్ చేస్తే సరిపోతుంది. దీంతో మీ బ్రౌజర్ లేటెస్ట్ వెర్షన్కు అప్డేట్ అయి, సురక్షితంగా ఉంటుంది. సైబర్ దాడుల నుంచి వ్యక్తిగత డేటాను కాపాడుకోవాలంటే బ్రౌజర్లు, ఇతర సాఫ్ట్వేర్లను ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుకోవడం చాలా అవసరమని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రక్షణ రంగం ఉత్పత్తులకు కేరాఫ్ గా హైదరాబాద్
ఏపీలో భిక్షాటనపై పూర్తి నిషేధం
బురద మీద పడిందని ఇలా బుద్ధి చెప్పింది..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

