NTR District: ఉదయం గ్యాస్ సమస్య అంటూ ట్యాబ్లెట్ వేసుకుంది.. సాయంత్రం కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తుండగా
నందిగామలోని ఓ కళాశాల విద్యార్థిని మాగం నాగమణి, తన స్నేహితురాలితో కలిసి ఇంటికి వెళుతుండగా రోడ్డుపై కుప్పకూలి మరణించింది. క్షణాల్లో సంభవించిన ఈ గుండెపోటు ఘటన స్థానికులను కలచివేసింది. యువతి ఆరోగ్యంగానే ఉండేదని, ఉదయం గ్యాస్ సమస్యకు మాత్ర వేసుకుందని ఆమె స్నేహితులు తెలిపారు.
నందిగామలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. అనాసాగరం గ్రామానికి చెందిన మాగం నాగమణి అనే విద్యార్థిని సోమవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు కాలేజీ నుండి ఇంటికి తిరిగి వెళుతుండగా రోడ్డుపై కుప్పకూలిపోయింది. ఆమె స్నేహితురాలు, స్థానికుల సహాయంతో ఆమెను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు ఆమెను చనిపోయినట్లు ప్రకటించారు. గుండెపోటుతో ఆమె మృతి చెందినట్లు నిర్ధారణ అయ్యింది. నాగమణికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, ఆమె ఎంతో చలాకిగా ఉండేదని ఆమె స్నేహితులు, అధ్యాపకులు తెలిపారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
Follow Us
వైరల్ వీడియోలు
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్కు గిఫ్ట్గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

