రికార్డులు తిరగరాసిన శ్రీశైలం రిజర్వాయర్..

Updated on: Oct 07, 2025 | 2:41 PM

శ్రీశైలం రిజర్వాయర్ ఈ సీజన్‌లో రికార్డు స్థాయి నీటిని స్వీకరించి విడుదల చేసింది. కృష్ణ, తుంగభద్ర, హంద్రీ నదుల నుండి 2105 టీఎంసీల వరద నీరు రిజర్వాయర్‌కు చేరగా, దిగువన నాగార్జున సాగర్‌కు 1578 టీఎంసీలు విడుదలయ్యాయి. తాగు, సాగునీటి అవసరాలు తీరాక కూడా వందల టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోతోంది.

శ్రీశైలం రిజర్వాయర్ ఈ సీజన్‌లో రికార్డులను తిరగరాసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక నీటిని స్వీకరించి, దిగువకు విడుదల చేసింది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు ఈ సీజన్‌లో ఇప్పటివరకు 1578 టీఎంసీల నీరు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. కృష్ణ, తుంగభద్ర, హంద్రీ వంటి నదుల నుండి రిజర్వాయర్‌కు మొత్తం 2105 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ఈ వరద ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. ఈ సీజన్‌లో మరో 100 టీఎంసీల వరకు నీరు వచ్చి చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారీగా వచ్చి చేరిన ఈ నీటిలో తాగునీటి, సాగునీటి అవసరాలు తీరగా, దిగువన ఉన్న నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌లను దాటుకుంటూ వందల టీఎంసీల నీరు సముద్రంలోకి ప్రవహించి పోతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

AP Liquor Scam: ఏపీ కల్తీ లిక్కర్‌ కేసులో కొత్త లింకులు

Shilpa Shetty: చీటింగ్ కేసులో నటి శిల్పాశెట్టిపై ప్రశ్నల వర్షం

సిరిమాను దర్శనం కోసం తరలివస్తున్న లక్షలాది మంది భక్తులు..

Loading...
Unable to load recommendations.
Follow Us