శ్రీకాకుళం జిల్లాపై వాయుగుండం ప్రభావం ఎలా ఉందంటే

Updated on: Oct 03, 2025 | 1:31 PM

శ్రీకాకుళం జిల్లాపై వాయుగుండం ప్రభావంతో వంశధార నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఒడిశా క్యాచ్‌మెంట్ ప్రాంతంలో భారీ వర్షాలతో గొట్టా బ్యారేజీ వద్ద వరద పెరుగుతోంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగా, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

శ్రీకాకుళం జిల్లాపై వాయుగుండం తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని కారణంగా జిల్లాలోని ప్రధాన నదులైన నాగావళి, వంశధార ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఒడిశా క్యాచ్‌మెంట్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో వంశధార నదికి వరద పోటెత్తుతోంది. గొట్టా బ్యారేజీ వద్ద గంటగంటకు వరద ప్రవాహం పెరుగుతోంది. అర్ధరాత్రి 12 గంటల నుండి వరద ఉద్ధృతి పెరుగుతూ, ఉదయం 6 గంటల సమయానికి 69,000 క్యూసెక్కులకు చేరింది. కాశీ నగరం వద్ద 90,000 క్యూసెక్కుల నీరు వంశధారకు చేరినట్లు అధికారులు గుర్తించారు, ఇది త్వరలో గొట్టా బ్యారేజీకి చేరుకోనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

ఇండియా రక్షణ వ్యవస్థకు బూస్ట్.. ధ్వని క్షిపణి

పండగ పూట.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో కదలిక

రన్‌వే పై రెండు విమానాలు ఢీ.. వీడియో వైరల్‌