సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. ఈ సందర్భంగా మ్యాచ్ విక్టరీ అనంతరం హోటల్ రూమ్కు వెళ్లే సమయంలో టీమిండియా ఆటగాళ్ల సంబురాలు జరుపుకున్నారు. హోటల్ రూంకు వెళ్లే దారిలో పుజారా, సిరాజ్, ఇతర ఆటగాళ్లు తమ డ్యాన్స్లతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా లెగ్ షేకింగ్ డ్యాన్స్తో ఇరగదీశారు. దీనికి సంబంధించిన వీడియోనూ అశ్విన్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. డాన్స్ చేస్తోన్న హోటల్ సిబ్బందిని చూసి భారత క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, ఛెతేశ్వర్ పుజారా సైతం స్టెప్పులేశారు. ఈ వీడియోను అశ్విన్ తన ఇన్స్టాలో అభిమానులతో పంచుకున్నాడు. మ్యాచ్ అనంతరం ఎప్పుడూ ఉండే ఫొటోలు బోర్ కొడతాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: