Shikhar Dhawan: భార్య మానసికంగా వేధిస్తోందంటూ కోర్టుకెక్కిన ధావన్

|

Oct 07, 2023 | 9:01 AM

భారత స్టార్‌ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌, ఆయేషా ముఖర్జీ దంపతులకు ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. కొంతకాలంగా ఆయేషా ముఖర్జీకి ధావన్‌ దూరంగా ఉంటున్న ధావన్‌.. తన భార్య తనను మానసికంగా హింసిస్తోందని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్‌ ధాఖలు చేశాడు. డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకుని, నిత్యం మానసికంగా వేధిస్తోందంటూ ధావన్ తన భార్యపై చేసిన ఆరోపణలు నిజమేనని కోర్టు విశ్వసించింది.

భారత స్టార్‌ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌, ఆయేషా ముఖర్జీ దంపతులకు ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. కొంతకాలంగా ఆయేషా ముఖర్జీకి ధావన్‌ దూరంగా ఉంటున్న ధావన్‌.. తన భార్య తనను మానసికంగా హింసిస్తోందని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్‌ ధాఖలు చేశాడు. డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకుని, నిత్యం మానసికంగా వేధిస్తోందంటూ ధావన్ తన భార్యపై చేసిన ఆరోపణలు నిజమేనని కోర్టు విశ్వసించింది. దీంతో మూడేళ్లుగా విడిగా ఉంటున్న ఈ దంపతులకు గ్రౌండ్ ఆఫ్ క్రూయెల్టీ కింద విడాకులు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. భార్య మానసిక పరిస్థితి నేపథ్యంలో కొడుకు కస్టడీని తనకే అప్పగించాలంటూ ధావన్ చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ.. ఆ బాలుడు ఆస్ట్రేలియా పౌరుడు కావడంతో కస్టడీ కోసం అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించాలని సూచించింది. అయితే, కొడుకును కలుసుకునేందుకు ధావన్ ను అభ్యంతరం పెట్టవద్దని, స్కూలు సెలవు దినాలలో సగం రోజులు తండ్రితో గడిపేందుకు బాలుడికి అవకాశం కల్పించాలని ధావన్ భార్యను ఆదేశించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వజ్రాలు.. వైఢూర్యాల కోసం అర్థరాత్రి ఏం చేశారో తెలుసా ??

Follow us on