కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు బీసీసీఐ షాక్‌ వీడియో

Updated on: Jan 04, 2026 | 6:05 PM

కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. వేలంలో కొనుగోలు చేసిన బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను విడుదల చేయాలని ఆదేశించింది. ఈ కొనుగోలుపై కేకేఆర్ యజమాని షారుక్ ఖాన్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో, ప్రముఖ ఆధ్యాత్మిక, రాజకీయ నాయకులు కూడా మండిపడటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఊహించని షాక్ ఇచ్చింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో కేకేఆర్ కొనుగోలు చేసిన బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను వెంటనే విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది.ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ తొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయలకు బిడ్ చేసి సొంతం చేసుకుంది. అయితే, ఒక బంగ్లాదేశ్ ఆటగాడిని కొనుగోలు చేయడాన్ని పలువురు తీవ్రంగా వ్యతిరేకించారు.

మరిన్ని వీడియోల కోసం :

ఎన్టీఆర్‌పై చేతబడి..క్లారిటీ.. ఇదే వీడియో

ఆ సినిమా వల్లే నా కెరీర్ నాశనమైంది వీడియో

బెదిరింపులు,తిట్ల దండకాలు.. సోషల్ మీడియాలో ఆ ఇద్దరి హంగామా వీడియో

న్యూ ఇయర్ వేళ.. నటి పావలా శ్యామలను పరామర్శించిన సజ్జనార్ వీడియో