Super tallented boy: బాలుడి అద్భుత ట్యాలెంట్‌.. బాలుడి ట్యాలెంట్‌కు దినేష్‌ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా..!

Updated on: Jul 09, 2022 | 9:42 AM

ఐపీఎల్‌-2022 లో అద్భుత ఫర్మామెన్స్‌తో మూడేళ్ల తర్వాత మళ్లీ టీమిండియాలో చోటు సంపాదించాడు సీనియర్‌ ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌ . ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో తనకు


ఐపీఎల్‌-2022 లో అద్భుత ఫర్మామెన్స్‌తో మూడేళ్ల తర్వాత మళ్లీ టీమిండియాలో చోటు సంపాదించాడు సీనియర్‌ ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌ . ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో తనకు అప్పగించిన ఫినిషింగ్‌ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. జూలై 7 నుంచి పరిమిత ఓవర్ల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా కౌంటీ జట్టులతో రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడింది. ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లలో భారత జట్టు కెప్టెన్‌గా దినేష్‌ కార్తీక్‌ వ్యవహరించాడు. కాగా తన కెరీర్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించడం దినేశ్‌కు ఇదే తొలిసారి. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ విజయం సాధించింది. ఈ క్రమంలో కార్తీక్‌పై పృథ్వీష్ (Pritveesh) అనే బాలుడు తనదైన శైలిలో అభిమానాన్ని చాటుకున్నాడు. మొజాయిక్ కళాకారుడైన పృథ్వీష్ 600 రూబిక్స్ క్యూబ్‌లను ఉపయోగించి కార్తీక్‌ చిత్రాన్ని రూపొందించాడు.దీనికి సంబంధించిన వీడియోను పృథ్వీష్ తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. కొన్ని గంటల్లోనే ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలా భారీ పోర్ట్రెయిట్‌ రూపొందించిన పృథ్వీశ్‌పై నెట్టింట ప్రశంసల వర్షం కురిస్తోంది. క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ కూడా ఈ పోర్ట్రెయిట్‌పై స్పందించాడు. ‘బాగా తయారు చేశావు పృథ్వీ , ఇది నన్ను బాగా అకట్టుకుంది’ అని మెచ్చుకున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Published on: Jul 09, 2022 09:41 AM