9 గంటలకు పైగా నిద్రపోతే.. చావు మూడినట్లేనా?

Updated on: Aug 05, 2025 | 5:40 PM

కంటినిండా నిద్ర పడితే.. శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందనేది నిపుణులు చెప్పే మాట. నిద్ర కరువైనా,నిద్ర నాణ్యత తగ్గినా గుండె జబ్బుల మొదలు కేన్సర్ వరకు అనేక రోగాలొచ్చే ప్రమాదం ఉందని, అదే సమయంలో నిద్ర ఎక్కువైనా ప్రమాదమేనని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రోజుకు పది గంటలకు పైగా నిద్రిస్తే.. మరణించే ముప్పు 34 శాతం పెరుగుతుందని ఓ అధ్యయనంలో తెలిసింది.

గంటల తరబడి నిద్రించడం వల్ల గుండె జబ్బుల బారిన పడటంతోపాటు, మరణించే అవకాశాలు పెరుగుతున్నాయని ఒక్లహామా యూనివర్సిటీ నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. రాత్రుళ్లు ఆరు గంటలు, అంత కంటే ఎక్కువ సేపు నిద్రిస్తూ.. పగటి పూట కూడా గంటల తరబడి గుర్రుపెట్టి నిద్ర పోయే వారికి గుండె జబ్బుల ముప్పు పెరుగుతోందని ఈ పరిశోధన నిర్ధారించింది. అదే రాత్రి పూట ఆరు గంటల కంటే తక్కువ నిద్రించే వారు పగలు నిద్రపోయినా.. ఈ రిస్కేమీ కనిపించలేదట. అదే సమయంలో.. కనీసం 6 గంటలైనా నిద్రకు నోచుకోని వారికి అకాల మరణం ముప్పు సాధారణ వ్యక్తుల కంటే.. అనేక రెట్లు ఎక్కువని పరిశోధకులు తేల్చారు. కనుక.. రాత్రి సరిపడా నిద్రపోయిన వారు పగటి నిద్ర మానుకుంటే మంచిదని వారు సూచిస్తున్నారు. రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర సరిపోతుందని పరిశోధకులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గూగుల్‌ మ్యాప్స్‌‌ను గుడ్డిగా నమ్మిన మహిళ.. అర్థరాత్రి ఊహించని ఘటన

కోహినూర్ ధరిస్తే అరిష్టమా ?? అసలు చరిత్ర ఇదే

Sania Mirza: అతనితో రొమాన్స్ కి రెడీ అంటున్న సానియా మీర్జా

రీల్స్ పిచ్చి తో హత్యలు కూడా చేస్తున్నారా ?? చివరికి తోడబుట్టిన అక్కని కూడా!

పుణ్యానికి పోతే.. పాపం ఎదురైంది.. కట్ చేస్తే జైలు పాలయ్యాడు

Loading...
Unable to load recommendations.
Follow Us