హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్కు ప్రాణ గండం తప్పింది. ప్రస్తుతం ఆయన మాధాపూర్లోని మెడ్కవర్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో ఆయన హెల్మెట్ వేసుకుని ఉండటంతో పెను ముప్పు తప్పినట్లు భావిస్తున్నారు. రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ తదితరులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం సాయి ధరమ్ను మెడ్కవర్ నుంచి అపోలో ఆస్పత్రికి తరలించారు.
Also Read..