అనుమానాల్లేవ్.. అపోహల్లేవ్ అంటూ విశాఖలో పాలనకు ముహూర్తం ఫిక్స్ చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. దీంతో మరోసారి రాజధాని ముహూర్తంపై రాజకీయ ఆసక్తి రేకెత్తిస్తోంది. మూడు రాజధానులపై బిల్లు ఉపసంహరించుకున్న ప్రభుత్వం… బడ్జెట్ సమావేశాల్లో మళ్లీ అదే బిల్లుకి మెరుగులు దిద్ది ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు రాజధానులపై ఎలాంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గబోమని క్లూస్ ఇస్తూనే ఉంది వైసీపీ ప్రభుత్వం. ఇక మార్చిలో విశాఖ వేదికగా కీలక సదస్సులు జరగనున్నాయి. వాటి కన్నా ముందే ముఖ్యమంత్రి జగన్ కీ డెసిషన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయనే చర్చ జోరందుకుంది.