కేంద్రం ప్రభుత్వం నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తే.. దక్షణాదిలో నాన్ బీజేపీ పార్టీల నేతలు ఐక్యతా రాగం వినిపించారు. దేశంలో బీజేపీ ఆరాచక పాలన పరాకాష్టకు చేరిందని కేసీఆర్ ఆరోపణలు గుప్పిస్తే.. దేశాభావృద్ధిపై జరుగుతున్న నీతి ఆయోగ్ కంటే రాజకీయాలు ముఖ్యమా అంటూ ప్రశ్నించింది కాషాయం. రాజకీయాలకతీతంగా టీమ్ ఇండియాతో దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నామని బీజేపీ అంటే… ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తుందని బీజేపీయేతర సీఎంలు ఆరోపిస్తున్నారు.