Watch Video: మాజీమంత్రి అంబటి రాంబాబు ఇంటి ముందు తెలుగు యువత ఆందోళన..

Updated on: Jun 10, 2024 | 1:51 PM

ఏపీలో మాజీమంత్రి అంబటి రాంబాబుకు తెలుగుదేశం పార్టీ నుంచి ఆందోళన సెగ తగిలింది. గుంటూరులోని ఆయన నివాసం వద్దకు చేరుకున్న తెలుగు యువత ఆందోళన చేపట్టింది. ఆయన ఇంటివైపు దూసుకెళ్లే ప్రయత్నం చేసిన తెలుగు యువత కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కొంతసేపు తెలుగుదేశం కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇలా ఇరువురి మధ్య వాగ్వాదం తరువాత ఆందోళనకారులు మాజీ మంత్రి అంబటి రాంబాబు చిత్రపటానికి బొట్టు పెట్టి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మహోత్సవానికి ఆహ్వానించారు.

ఏపీలో మాజీమంత్రి అంబటి రాంబాబుకు తెలుగుదేశం పార్టీ నుంచి ఆందోళన సెగ తగిలింది. గుంటూరులోని ఆయన నివాసం వద్దకు చేరుకున్న తెలుగు యువత ఆందోళన చేపట్టింది. ఆయన ఇంటివైపు దూసుకెళ్లే ప్రయత్నం చేసిన తెలుగు యువత కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కొంతసేపు తెలుగుదేశం కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇలా ఇరువురి మధ్య వాగ్వాదం తరువాత ఆందోళనకారులు మాజీ మంత్రి అంబటి రాంబాబు చిత్రపటానికి బొట్టు పెట్టి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మహోత్సవానికి ఆహ్వానించారు. ఒక కుర్చీపై ఆయన చిత్రపటాన్ని ఉంచి.. పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు అలంకరించి నానా హంగామా చేశారు. కాసేపటి తరువాత పరిస్థితి సర్థుమణిగింది. అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గంనుంచి వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమిపాలయ్యారు. దీంతో రెచ్చిపోయిన యువత ఇలా వినూత్న కార్యక్రమానికి తెరలేపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us