Bandi Sanjay: అలా అనే వారిని చెప్పుతో కొట్టండి.. బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు – Watch Video

Updated on: Feb 26, 2024 | 11:40 AM

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు ఉంటుందంటూ జరుగుతున్న ప్రచారంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మరో వారం రోజుల్లో తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థులను బీజేపీ ప్రకటించనుందని చెప్పారు. ఇక బీఆర్ఎస్‌తో పొత్తుకు అవకాశం ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు ఉంటుందంటూ జరుగుతున్న ప్రచారంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మరో వారం రోజుల్లో తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థులను బీజేపీ ప్రకటించనుందని చెప్పారు. ఇక బీఆర్ఎస్‌తో పొత్తుకు అవకాశం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేసీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని అన్నారని, పోటీ చేశామా? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలుస్తాయని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ దీనికి సమాధానం చెప్పాలన్నారు. BJP – BRS‌ మధ్య పొత్తు అంటే చెప్పుతో కొట్టాలంటూ బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు..

అటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులపైనా బండి సంజయ్‌ స్పందించారు. CBI, EDఈడీ స్వతంత్ర సంస్థలు, వాటికున్నా అధారాల ఆధారంగా విచారణ చేస్తాయన్నారు. తప్పు చేసినవారిని తప్పకుండా దర్యాప్తు సంస్థలు అరెస్ట్‌ చేస్తాయన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..

Published on: Feb 26, 2024 11:39 AM
Loading...
Unable to load recommendations.
Follow Us