Watch Video: కంటతడి పెట్టిన కాంగ్రెస్ మహిళా నేత.. అసలు కారణం ఇదే..

| Edited By: Srikar T

Mar 27, 2024 | 4:55 PM

సిద్దిపేట జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కంటతడి పెట్టారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ప్రెస్ మీట్ సమయంలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు వేదికపై కూర్చున్నారు.

సిద్దిపేట జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కంటతడి పెట్టారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ప్రెస్ మీట్ సమయంలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు వేదికపై కూర్చున్నారు. కానీ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మీకి కుర్చీ వేయలేదు. దీంతో ప్రెస్ మీట్ అనంతరం ముద్దం లక్ష్మీ బాధపడుతూ కంటతడి పెట్టారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశామన్నారు. నేడు పార్టీ అధికారంలోకి రాగానే కొత్తగా చేరిన వారికి మర్యాదలు చేస్తూ.. తమకు మర్యాద ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా పార్టీ పెద్దల తీరుపై అసహనం వ్యక్తం చేశారు ముద్దం లక్ష్మీ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow us on