Watch: పులివెందులలో వైసీపీ ఓటమిపై సజ్జల కీలక వ్యాఖ్యలు
Pulivendula ZPTC Result: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. తాజాగా ఆ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత సజ్జల రామకృష్ణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఏజెంట్లను సైతం కనీసం పోలింగ్ కేంద్రాల్లోకి రానివ్వకుండా ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు.
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో ప్రజాస్వామ్య పద్దతిలో పోలింగ్ జరగలేదని ఆరోపించారు. వైసీపీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఏజెంట్లను కనీసం పోలింగ్ బూత్లోకి రానివ్వలేదని ఆరోపించారు. మహిళలు క్యూలైన్లలో లేకుండా పోలింగ్ జరిగిందని అభ్యంతరం చెప్పారు. బయటినుంచి వచ్చినవారు దొంగ ఓట్లు వేసి వెళ్లారని ఆరోపించారు. పోలీసులు చూస్తూ ప్రేక్షక పాత్ర పోషించారని.. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే అసలు విషయం బయటపడుతోందన్నారు.
Follow Us
వైరల్ వీడియోలు
మృత్యుంజయుడు.. పిడుగు పడినా బతికాడు
పాత ప్యాంటు జేబులో లాటరీ టికెట్.. చివరి నిమిషంలో అద్భుతం
అడవిలో లంకెబిందెలు.. వాటి నిండా బంగారం, వజ్రాలు..
బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్! కస్టమర్ షాక్
ఆహా.. ఇలాంటి అత్తింటివారుంటే..అల్లుడికి నిత్యం పండగే!
కోట్లు ఇచ్చినా రాని ఆనందం.. రైతన్నను మురిపించిన నేల తల్లి
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !

