PM Modi Mother Last Rites: మోదీ తల్లి అంతిమ యాత్ర.. లైవ్ వీడియో

Updated on: Dec 30, 2022 | 8:41 AM

ప్రధాని మోదీ అమ్మగారు హీరాబెన్‌ కన్నుమూశారు. హీరాబెన్ మోదీ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అహ్మదాబాద్ నగరంలోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు.

ప్రధాని మోదీ అమ్మగారు హీరాబెన్‌ కన్నుమూశారు. హీరాబెన్ మోదీ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అహ్మదాబాద్ నగరంలోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. ప్రధాని మోదీ తన తల్లి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఇటీవలే హీరాబెన్ వందో పుట్టినరోజు జరుపుకున్నారు. హీరాబెన్‌ మృతిపై ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని నా తల్లి ఈశ్వరుడి పాదాల వద్దకు చేరింది. ఆమె జీవితం ఒక తపస్సులాంటిదిని మోదీ ట్వీట్‌ చేశారు.

Published on: Dec 30, 2022 06:37 AM