తెలంగాణలో టీడీపీ, జనసేనతో పొత్తు ఉంటుందా..? బీజేపీ చీఫ్ రామచందర్‌రావు ఏమన్నారంటే..

Updated on: Aug 04, 2025 | 9:16 AM

పొత్తులు, విలీనంపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీ9 క్రాస్‌ ఫైర్‌లో మాట్లాడిన రాంచందర్‌రావు.. ఏపీలో మాదిరిగా తెలంగాణలో బీజేపీకి పొత్తులు ఉండవు.. అంటూ క్లారిటీ ఇచ్చారు. టీడీపీ, జనసేన సహా ఏ పార్టీతోనూ తెలంగాణలో పొత్తు ఉండదంటూ స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోరాడుతుందని రాంచందర్‌రావు పేర్కొన్నారు.

పొత్తులు, విలీనంపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీ9 క్రాస్‌ ఫైర్‌లో మాట్లాడిన రాంచందర్‌రావు.. ఏపీలో మాదిరిగా తెలంగాణలో బీజేపీకి పొత్తులు ఉండవు.. అంటూ క్లారిటీ ఇచ్చారు. టీడీపీ, జనసేన సహా ఏ పార్టీతోనూ తెలంగాణలో పొత్తు ఉండదంటూ స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోరాడుతుందని రాంచందర్‌రావు పేర్కొన్నారు. టీవీ9 క్రాస్ ఫైర్‌లో ఆయన ఇంకా ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం‌ ప్రాజెక్ట్‌పై కూడా బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకం కాదన్నారు. కాళేశ్వరం ఏటీఎంలా మారిందని ముందు నుంచి చెబుతూనే ఉన్నామని రాంచందర్‌రావు చెప్పారు..

Published on: Aug 04, 2025 09:16 AM