భారత దేశ చట్టసభలో నవ శకంగా నిలవనున్న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంట్.. దేశ అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. ఓ మహా కట్టడాన్ని నిర్మించడమే కాకుండా.. అందులో అడుగడుగునా భారతీయత ఉట్టిపడేలా చేశారు. దేశ రాజధాని నడిబొడ్డున అధునాతన సదుపాయాలు, సకల హంగులతో నిర్మించిన నూతన పార్లమెంటు భవంతిని ప్రధాని మోదీ ప్రారంభించారు. కొత్త పార్లమెంట్ని జాతికి అంకితం చేశారు. ఆదివారం ఉదయం 7:30 గంటలకు కొత్త పార్లమెంట్ భవనానికి చేరుకున్న ప్రధాని మోదీకి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్వాగతం పలికారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి మోదీ నివాళులు అర్పించారు. ఆత్మనిర్భరతకు ప్రతీకగా నిలవనున్న ఈ అధునాతన పార్లమెంటు భవంతి వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో భాగంగా తొలుత గణపతి హోమం నిర్వహించారు. పూజ తర్వాత రాజదండం సెంగోల్కు మోదీ సాష్టాంగ సమస్కారం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.