Watch: గో బ్యాక్ మార్వాడి ఉద్యమంపై రాజా సింగ్ రియాక్షన్ ఇదిగో..
గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్.. తెలంగాణలోని "గో బ్యాక్ మార్వాడి" ఉద్యమంపై స్పందించారు. ఈ ఉద్యమం రాజకీయ లబ్ధి కోసం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి మార్వాడీల పాత్రను ఆయన ప్రశంసించారు. అలాగే, కొంతమంది మార్వాడీ వ్యాపారులు నాణ్యత లేని సామాన్లు అమ్ముతున్నారనే విషయాన్ని కూడా ఆయన గుర్తించారు.
రాజకీయ లబ్ధికోసమే కొందరు మార్వాడీ గోబ్యాక్ అంటున్నారని అన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. నిజాం కంటే ముందు నుంచే తెలంగాణలో మార్వాడీలు ఉన్నారని.. తెలంగాణతో పాటు దేశ అభివృద్ధికి మార్వాడీలు దోహదపడుతున్నారని ఆయన అన్నారు. బీజేపీలో నాయకులను కొందరు ఫుట్ బాల్ ఆడుకుంటున్న మాట వాస్తవమేనని.. కొందరు బీజేపీ నేతల కారణంగానే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకుండా పోయిందన్నారు. రాజాసింగ్తో టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ విద్యాసాగర్ ఫేస్ టు ఫేస్.
గో బ్యాక్ మార్వారి ప్రచారం తెలంగాణలోని అన్ని జిల్లాలకు వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. రాజకీయ లబ్ధి కోసమే ఈ ప్రచారాన్ని తెరమీదకు తెచ్చారని బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు.
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం

