CM Chandrababu: ఏపీలో సంక్రాంతి నుంచి అన్ని సేవలూ ఆన్ లైన్ లోనే
ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి నుండి అన్ని ప్రభుత్వ సేవలను ఆన్లైన్లో అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. డ్రోన్ సేవల విస్తరణకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని, ఆర్టీసీ సేవలు, పరిశుభ్రత మెరుగుపరచాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ నుండి అన్ని ప్రభుత్వ సేవలను ఆన్లైన్ ద్వారా పౌరులకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్)పై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ కీలక నిర్ణయాలు ప్రకటించారు. ప్రస్తుతం భౌతికంగా సేవలు అందిస్తున్న శాఖలు వెంటనే ఆన్లైన్ విధానానికి మారేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
18 బ్యాంకుల నుంచి రూ.5,572 కోట్లు తీసుకున్న అన్మోల్ అంబానీ
భారత్ లో విదేశీ కంపెనీల పెట్టుబడుల జాతర
CM Revanth Reddy: కులం అనే అడ్డుగోడలను తొలగించేందుకే యంగ్ ఇండియా స్కూల్స్
