Big News Big Debate: వైసీపీ ప్లీనరీకి బయలుదేరిన సీఎం జగన్.. తనయుడి వెంట విజయమ్మ
టార్గెట్ 2024. మళ్లీ గెలవాలి, క్లీన్స్వీప్ చేయాలి. పార్టీ నేతలకు ఇప్పటికే టార్గెట్ పెట్టేశారు సీఎం జగన్. రేపు, ఎల్లుండి జరగబోయే ప్లీనరీలో దీనిపై కేడర్కు మరింత దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈసారి ప్లీనరీలో సంచలన నిర్ణయాలు ఉంటాయనేది వైసీపీ నేతలు చెబుతున్న మాట. అధికార పార్టీ పరంగా రాబోయే రెండేళ్లు ఏం చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది. కొత్త పథకాలు, హామీలు ఏమైనా ఇస్తారా? అన్న చర్చ నడుస్తోంది.