తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. దశాబ్ధాల రాజకీయ చరిత్ర ఉన్న మర్రి శశిధర్ రెడ్డి పార్టీ వీడుతున్నట్టు ప్రకటించారు. రాజకీయాల్లో ఫిరాయింపులు సహజమే కానీ మర్రి కుటుంబం మారాలనుకోవడం పెద్ద సంచలనమే అయింది. పార్టీ బ్లాక్ మెయిలర్ల చేతికి పోయిందని… తమలాంటి సీనియర్లకు చోటు లేదంటూ ఘాటుగా విమర్శించారు. సరిగ్గా ఇదే సమయంలో అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు రంగంలో దిగిన బీజేపీ మర్రికి గాలం వేసి సక్సెస్ అయింది. ఇంకా చాలామంది కాంగ్రెస్ పెద్దలు టచ్లో ఉన్నారంటూ బాంబ్ పేల్చింది కమలం.