పంచభూతాల్లో ఒకటి మాత్రమే కాదు.. మనిషి పరిణామంలో అత్యంత కీలకమైంది కూడా అగ్ని. అలాంటి ప్రాముఖ్యత ఉన్న నిప్పు పట్ల నిర్లక్ష్యంగా లేదా పొరపాటుగా వ్యవహరిస్తే వచ్చే కష్టనష్టాలను భరించడం ఎవరికీ సాధ్యం కాదు. హైదరాబాద్ మహానగరంలోని రాంగోపాల్ పేటలో జరిగిన అగ్నిప్రమాదం చెబుతున్న పాఠమిదే. ఇదే గతంలోనూ అనేక ప్రమాదాలకు కారణంగా అధికారుల అలసత్వం లేదా, అక్కడుండేవారి నిర్లక్ష్యం అయి ఉంటుంది. అగ్నిప్రమాదాలు యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు కేవలం మానవ తప్పిదాలే అని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది.