అంబటి మౌనికకు కాపు నేతల ఆశీర్వాదం

Updated on: Feb 23, 2026 | 10:55 PM

కాపు నేతలు అంబటి మౌనికకు సంఘీభావం తెలిపారు. తమ నివాసంపై జరిగిన దాడి తర్వాత మౌనిక ధైర్యంగా స్పందిస్తూ, హోం మంత్రి అనిత, పవన్ కళ్యాణ్‌లను ప్రశ్నించారు. ముద్రగడ పద్మనాభం ఆమెను ఫైర్‌బ్రాండ్గా అభివర్ణించి, మమతా బెనర్జీ స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు. వైఎస్సార్‌సీపీలో ఆమె రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలున్నాయి.

మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనికకు గోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతాల సీనియర్ కాపు నేతలు మద్దతు పలికారు. ఇటీవల వారి నివాసంపై జరిగిన దాడి నేపథ్యంలో సంఘీభావం తెలిపిన నేతలు, ఆమె భవిష్యత్తు ప్రయత్నాలకు తమ పూర్తి మద్దతు, ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా మౌనిక హోం మంత్రి అనిత, పవన్ కళ్యాణ్‌లను సూటిగా ప్రశ్నించారు. ఆడవారి మర్యాదను దెబ్బతీస్తూ, కాపు మహిళలపై దాడి చేయడం ఏ రకంగా సమంజసమని ఆమె నిలదీశారు. తమ బలం చూసుకుని కాపు మహిళలను దూషించడాన్ని పవన్ కళ్యాణ్ ఖండించాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహిళను చంపేందుకు కత్తితో ఇంట్లోకి వెళ్లిన దొంగ అరెస్ట్

నిత్యావసరాలే కాదు.. ప్రాణాలు నిలబెట్టే ఔషధాలలో కూడా కల్తీ

తెలంగాణాలో వర్షాలు.. జలమయమైన కాలనీలు..నీటమునిగిన రోడ్లు

ఏడుకొండల వాడి చెంత ఇక గోల్డెన్ థంబ్ రూల్

ఉగ్రవాదంపై ఉక్కుపాదానికి కేంద్రం కొత్త పాలసీ

Loading...
Unable to load recommendations.
Follow Us