PM Modi: ఆదంపూర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ప్రధాని ప్రసంగం.. ఆయన ఏమన్నారంటే

Updated on: May 13, 2025 | 3:33 PM

పంజాబ్‌లోని ఆదంపూర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ను ప్రధాని మోదీ ఈ ఉదయం సందర్శించారు. అక్కడి జవాన్లతో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్‌ సందర్భంగా IAF ధైర్యసాహసాలను ప్రధాని ప్రశంసించారు. జవాన్లలో ఆత్మసైర్థ్యాన్ని నింపారు. దాదాపు గంటసేపు ప్రధాని మోదీ ఆదంపూర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో గడిపారు.

పంజాబ్‌లోని ఆదంపూర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ను ప్రధాని మోదీ ఈ ఉదయం సందర్శించారు. అక్కడి జవాన్లతో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్‌ సందర్భంగా IAF ధైర్యసాహసాలను ప్రధాని ప్రశంసించారు. జవాన్లలో ఆత్మసైర్థ్యాన్ని నింపారు. దాదాపు గంటసేపు ప్రధాని మోదీ ఆదంపూర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో గడిపారు. ఎయిర్‌ఫోర్స్‌ జవాన్లతో కలిసి భారత్‌ మాతాకి జై, వందేమాతరం అని నినదించారు. పంజాబ్‌లోని జలంధర్‌కు దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌. ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు ఈ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ప్రధాని మోదీ ల్యాండయ్యారు. ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బంది, సీనియర్‌ అధికారులతో ఆయన మాట్లాడారు. ఆపరేషన్‌ సింధూర్‌కు సంబంధించి సమాచారం సేకరించడంతో పాటు ఆయన వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ కూడా తీసుకున్నారు. ఆయన జవాన్లను ఉత్తేజపరుస్తూ ఏం మాట్లాడారన్నది ఈ లైవ్ వీడియోలో చూసేయండి.

Published on: May 13, 2025 03:33 PM
Loading...
Unable to load recommendations.
Follow Us