అయోధ్య రామమందిరంలో ధ్వజారోహణ కార్యక్రమం.. ప్రత్యక్ష ప్రసారం

Updated on: Nov 25, 2025 | 3:41 PM

అయోధ్య రామమందిరంలో ధ్వజారోహణ కార్యక్రమానికి అంతా సిద్ధమైంది. బాలరాముడి ప్రాణప్రతిష్ట తర్వాత అంత ప్రతిష్టాత్మకమైన వేడుక ఇదే కావడంతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగాయి.. ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ ఆలయ శిఖరంపై కాషాయ జెండాను ఎగురవేస్తారు.

అయోధ్య రామమందిరంలో ధ్వజారోహణ కార్యక్రమానికి అంతా సిద్ధమైంది. బాలరాముడి ప్రాణప్రతిష్ట తర్వాత అంత ప్రతిష్టాత్మకమైన వేడుక ఇదే కావడంతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగాయి.. ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ ఆలయ శిఖరంపై కాషాయ జెండాను ఎగురవేయనున్నారు. 161 అడుగుల ఆలయ శిఖరంపై 30 అడుగుల ఎత్తుండే.. జెండా స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 11గంటల 58 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో ఈ కాషాయ జెండా ఎగురవేసే కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా అయోధ్య బాలరాముడికి ప్రధాని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.

ధ్వజారోహణం, కాషాయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు RSS చీఫ్‌ మోహన్‌భగవత్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ హాజరుకానున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పాటు ఆలయ చుట్టుపక్కల ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ధ్వజారోహణ కార్యక్రమంతో అయోధ్య రామజన్మభూమి ఆలయ ప్రధాన నిర్మాణం పూర్తికానుంది.

Published on: Nov 25, 2025 10:35 AM
Loading...
Unable to load recommendations.
Follow Us