ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, కేదార్నాథ్ ధామ్లను సందర్శించి తన భక్తిని చాటుకున్నారు. ఆలయాల అభివృద్ధి, భక్తుల వసతుల కల్పన కోసం రూ.10 కోట్ల భారీ విరాళాన్ని అందజేశారు. శీతాకాలంలో ఆలయాల మూసివేతకు ముందు ఆయన ఈ పర్యటన చేపట్టారు. యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఈ నిధులను ఉపయోగిస్తారు.