నాందేడ్లో ఆలయ ప్రసాదంలో విషం.. 150 మందికి అస్వస్థత
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది. ఉమ్మరి తాలూకాలోని కౌలిగూడా గ్రామంలో ఆలయంలో జరిగిన అన్నదాన ప్రసాదం తిన్న 150 మందికి అస్వస్థత ఏర్పడింది. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అన్నదాన కార్యక్రమం తర్వాత 150 మందికి అస్వస్థత ఏర్పడింది. ఈ సంఘటన నాందేడ్ జిల్లాలోని ఉమ్మరి తాలూకా, కౌలిగూడా గ్రామంలో జరిగింది. ఆలయంలో ప్రసాదంగా పంపిణీ చేసిన ఆహారం తిన్న తర్వాత ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన బాధితులు వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాధితులందరికీ చికిత్స కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల వేళ.. ఊహించని అడ్డంకులు
టాలీవుడ్ లో మరో కొత్త సమస్య రెంట్ Vs పర్సంటేజ్
Follow Us
