ఉద్యోగులకు శుభవార్త చెప్పనున్న కేంద్రం.. పీఎఫ్‌ వడ్డీ దీపావళి పండగకు ముందే మీ ఖాతాలో.. వీడియో

Updated on: Oct 16, 2021 | 9:56 AM

పండగ సీజన్‌ వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం, ఉద్యోగులకు శుభవార్త చెప్పనుంది. ప్రావిడెంట్ ఫండ్ చందాదారులందరికీ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్‌ఓ గుడ్‌న్యూస్‌ చెప్పనుంది.

పండగ సీజన్‌ వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం, ఉద్యోగులకు శుభవార్త చెప్పనుంది. ప్రావిడెంట్ ఫండ్ చందాదారులందరికీ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్‌ఓ గుడ్‌న్యూస్‌ చెప్పనుంది. పీఎఫ్‌ ఖాతాదారులకు ఈ ఆర్థిక సంవత్సరానికి గాను అందించే వడ్డీని దీపావళి పండగకు ముందు వారి ఖాతాల్లో జమ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే దాదాపు 6 కోట్ల మంది పీఎఫ్‌ చందాదారులకు ప్రయోజనం కలుగనుంది. కాగా, పీఎఫ్‌ చందాదారులకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీ చెల్లించాలని కేంద్ర సర్కార్‌ ఇది వరకే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు కేంద్ర కార్మికశాఖ కూడా సమ్మతి తెలిపింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Honey In Warm Water: గోరు వెచ్చని నిమ్మరసం నీటిలో తేనె కలపకూడదా? వీడియో

Viral Video: పులితో జెండర్‌ రివీల్‌ చేయడమా? వెర్రి ఆలోచనకు ట్రోలింగ్‌! వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us