Drug Party Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు

Updated on: Mar 15, 2026 | 9:04 PM

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫామ్‌హౌస్ సీజ్‌కు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కేసులో నలుగురిని రిమాండ్‌కు కోరనున్నారు, వారిలో పైలెట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నిమిత్ శర్మ, కౌశిక్ ఉన్నారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌కు నోటీసులు జారీ చేసి, డి-ఎడిక్షన్ సెంటర్‌కు వెళ్లాల్సిందిగా సూచించారు.

మొయినాబాద్ డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌ను సీజ్ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ పార్టీకి హాజరైన 11 మందిలో ఆరుగురికి డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. అయితే, వీరిలో ఐదుగురిని నోటీసులు జారీ చేసి, డి-ఎడిక్షన్ సెంటర్‌కు వెళ్లాల్సిందిగా సూచించిన అనంతరం విడుదల చేయనున్నారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌కు కూడా నోటీసులు జారీ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పోలీసుల అత్యుత్సాహంతో యువకుడి మృతి

Rashmika: రష్మిక మాస్ వార్నింగ్.. అలాంటి తప్పులు చేస్తే కట్టిన చర్యలు తప్పవు

Ustaad Bhagat Singh: పీక్స్‌కు చేరిన ఉస్తాద్ మ్యానియా! అంచనాలు భారీగా పెంచుతున్న మేకర్స్

దండయాత్రకు రెడీ అవుతున్న కుర్ర హీరోలు.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే

కండలు పెంచుతున్న టాలీవుడ్ స్టార్స్‌.. బాక్సాఫీస్‌కు కొత్త కిక్కిస్తారా

Follow Us