పాక్‌ ఉగ్రవాదులను పట్టించిన ‘టైసన్’

Updated on: Feb 24, 2026 | 3:25 PM

కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో ఆర్మీ డాగ్ టైసన్ అసాధారణ ధైర్యం ప్రదర్శించింది. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడినా, వెనక్కి తగ్గకుండా వారి స్థావరాన్ని గుర్తించడంలో సైన్యానికి సహకరించింది. దీని సాహసం వల్ల ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు, వారిలో కమాండర్ సైఫుల్లా కూడా ఉన్నాడు. గాయపడిన టైసన్‌కు చికిత్స అందిస్తున్నారు, దాని ఆరోగ్యం నిలకడగా ఉంది. సైనిక శునకాల ప్రాముఖ్యతను ఈ ఘటన చాటిచెప్పింది.

కశ్మీర్‌లో భద్రతా దళాలు జరిపిన ఆపరేషన్‌లో ‘టైసన్’ అనే ఆర్మీ డాగ్‌ అసాధారణ తెగువ ధైర్యాన్ని ప్రదర్శించింది. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడింది. అయినా వెనక్కి తగ్గకుండా, ముగ్గురు జైషే ఉగ్రవాదులను హతమార్చడంలో సహకరించింది. కిష్టవాడ్ జిల్లా చత్రూ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో స్పెషల్ ఫోర్సెస్ రంగంలోకి దిగింది. వారి స్థావరాన్ని గుర్తించేందుకు సైన్యంలోని 2 పారా యూనిట్‌లకు చెందిన జర్మన్ షెపర్డ్ జాతి శునకం టైసన్‌ను ముందుగా పంపారు. టైసన్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దాని కాలికి బుల్లెట్ గాయమైనా, అది వెనుదిరగకుండా ముందుకేవెళ్లింది. టైసన్ సాహసం వల్ల ఉగ్రవాదుల కచ్చితమైన స్థానం భద్రతా బలగాలకు తెలిసింది. దీంతో వారు వ్యూహాత్మకంగా దాడి చేసి, జైషే మహ్మద్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. మృతుల్లో రెండేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న జైషే కమాండర్ సైఫుల్లా కూడా ఉన్నాడు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన టైసన్‌ను వెంటనే హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం దాని ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ కూడా పాల్గొన్నారు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో సైనిక జాగిలాల పాత్ర ఎంత ముఖ్యమో ఈ ఘటన నిరూపించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహిళను చంపేందుకు కత్తితో ఇంట్లోకి వెళ్లిన దొంగ అరెస్ట్

నిత్యావసరాలే కాదు.. ప్రాణాలు నిలబెట్టే ఔషధాలలో కూడా కల్తీ

తెలంగాణాలో వర్షాలు.. జలమయమైన కాలనీలు..నీటమునిగిన రోడ్లు

ఏడుకొండల వాడి చెంత ఇక గోల్డెన్ థంబ్ రూల్

ఉగ్రవాదంపై ఉక్కుపాదానికి కేంద్రం కొత్త పాలసీ

Published on: Feb 24, 2026 01:48 PM
Loading...
Unable to load recommendations.
Follow Us