జస్టిస్ డెలివర్డ్ !! ముగ్గురు మృగాళ్లకు ఉరిని ఖరారు చేసిన కోర్టు

Updated on: Feb 16, 2026 | 9:06 PM

కర్ణాటకలోని హంపి సమీపంలో 2019లో జరిగిన విదేశీ టూరిస్టుల సామూహిక అత్యాచారం, హత్య కేసులో న్యాయం జరిగింది. ఈ రోజు కోర్టు మల్లేశ్, చైతన్య సాయి, శరణప్ప అనే ముగ్గురు దోషులకు మరణశిక్షను ఖరారు చేసింది. ఇజ్రాయెల్ మహిళా టూరిస్ట్, ఆమె స్నేహితురాలిపై అత్యాచారం చేసి, మరో విదేశీయుడిని హత్య చేసిన దుర్మార్గులకు ఉరిశిక్షతో తీర్పు వెలువడింది.

కర్ణాటకలో విదేశీ టూరిస్టుల అత్యాచారం, హత్య కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయం జరిగింది. హంపి సమీపంలో 2019 మార్చి 6న జరిగిన ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇజ్రాయెల్ దేశానికి చెందిన మహిళా టూరిస్ట్, ఆమె స్నేహితురాలిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా, వారితో పాటు ఉన్న మరో విదేశీయుడిని కూడా దారుణంగా హత్య చేశారు. ఈ దుర్మార్గులు బాధితుల వద్ద ఉన్న విలువైన వస్తువులను కూడా దోపిడీ చేసినట్లు ఆధారాలతో సహా కోర్టు గుర్తించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐదేళ్ల నిరీక్షణకు తెర.. శబరిమల కేసులో సుప్రీంకోర్టు డెడ్ లైన్ ఫిక్స్

నన్నయ యూనివర్సిటీలో సెగలు రేపుతున్న విద్యార్థుల ఆందోళన.. అసలు ఏం జరిగింది

Deputy CM Pawan Kalyan: పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే ముఖ్యం

మొన్న తారక్‌.. త్వరలో మహేష్‌.. వారిద్దరికీ అక్కడేం పని

హిట్‌కీ, అవకాశాలకీ లింక్‌ లేదంటున్న లేడీస్‌.. ఇక్కడ దమ్ముండాలి

Follow Us