Telangana: లొట్టలేసుకుని బిర్యానీ లాగించాలనుకున్నాడు.. తీరా ప్లేట్లో కనిపించింది చూడగా
హనుమకొండలోని చెఫ్ హోటల్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బిర్యానీలో ఇనుక తీగ వచ్చిందని కస్టమర్ ప్రశ్నించడంతో హోటల్ నిర్వాహకులు దాడికి దిగారు. వీడియో తీస్తున్న కస్టమర్ ఫోన్ లాక్కొని బయటకు తోసేసారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మీరూ ఓ సారి చూసేయండి.
హనుమకొండలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బిర్యానీలో ఇనుక తీగ వచ్చిందని ప్రశ్నించిన కస్టమర్పై దాడి చేశారు చెఫ్ రెస్టారెంట్ నిర్వహకులు. సదరు సంఘటనను వీడియో తీస్తుండగా.. కస్టమర్ ఫోన్ లాక్కొని బయటకు నెట్టేసే ప్రయత్నం చేశారు. ఆ కస్టమర్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ చేస్తానని హెచ్చరించినా.. చెప్పుకోపో మా దందా ఇదేనంటూ అతడ్ని బెదిరించారు. ఫైనల్గా కస్టమర్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ చేయడంతో.. హోటల్పై ఆసక్మిక తనిఖీలు చేసిన అధికారులు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో మీరూ చూసేయండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Loading...
Unable to load recommendations.
Follow Us