బడి పిల్లలకు ఏఐ తరగతులు.. పాఠశాల కరిక్యులంలో కేంద్రం మార్పులు వీడియో

Updated on: Oct 12, 2025 | 11:58 AM

2026-27 విద్యాసంవత్సరం నుంచి మూడో తరగతి నుంచే ఏఐ విద్యను పాఠశాల కరికులంలో ప్రవేశపెట్టాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు విద్యార్థులను, ఉపాధ్యాయులను సిద్ధం చేయడమే లక్ష్యమని సంజయ్ కుమార్ తెలిపారు. ఏఐ వల్ల 20 లక్షల ఉద్యోగాలు తొలగిపోవచ్చు, కానీ 8 మిలియన్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది.

ప్రస్తుతం అన్ని రంగాలలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యాసంవత్సరం నుండి మూడో తరగతి నుంచే అన్ని పాఠశాలల కరికులంలో ఏఐని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అన్ని తరగతుల విద్యార్థుల కోసం ఏఐ ఇంటిగ్రేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయనుంది. వచ్చే రెండు, మూడేళ్లలో విద్యార్థులు, ఉపాధ్యాయులు దీనికి సమన్వయం చేసుకునేలా వేగంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని కేంద్రం భావిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం :

గర్ల్స్‌ టాయిలెట్‌లో హిడెన్‌ కెమెరా కలకలం వీడియో

రంగు డబ్బాతో పాఠశాలకు స్టూడెంట్స్.. ఎందుకో తెలిస్తే అవాక్కు అవుతారు వీడియో

30 ఏళ్లనాటి ఆ కాగితాలే.. కోటీశ్వరుణ్ణి చేశాయి వీడియో