10వ తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

Updated on: Oct 07, 2025 | 6:13 PM

భారతీయ రైల్వేలో ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. జైపూర్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌ , నార్త్ వెస్ట్రన్ రైల్వే పరిధిలో వివిధ వర్క్‌షాప్‌లు, యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 2వేల 94 ఖాళీలకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానించారు. డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్‌ , బీటీసీ క్యారేజ్ , బీటీసీ లోకో , వర్క్‌షాప్‌లు, యూనిట్లలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది.

యాక్ట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతిలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసై ఉండాలి. ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, మేసన్, పైప్ ఫిట్టర్, ఫిట్టర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, వెల్డర్, మెకానికల్, డీజిల్ మెకానికల్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్ తదితర ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధుల వయోపరిమితి నవంబర్‌ 02, 2025 నాటికి 15 నుంచి 24 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్ 2, 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.100 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఛాతీలోకి 7 బుల్లెట్లు.. వీరమరణం.. ‘కాంతార 2’ హీరోయిన్ తండ్రి ఎవరో తెలుసా ??

అనాథ పిల్లల కోసం మై హోం గ్రూప్‌ మరో బృహత్తర కార్యక్రమం

ఈజిప్టులో ఫారో చక్రవర్తి సమాధి.. 20 ఏళ్ల తర్వాత తెరుచుకున్న తలుపులు

ఫ్రమ్‌ కోర్ట్‌ to ఫుడ్ కోర్ట్ !! మహిళలకు గుర్తింపు, గౌరవాన్ని సాధించడమే లక్ష్యం

మహాత్మా గాంధీపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ దిగజారుడు వ్యాఖ్యలు