రిపబ్లిక్ డే వేడుకల్లో తొలిసారి జంతు దళం
ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో భారత సైన్యం జంతు దళం ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న రీమౌంటెడ్ వెటర్నరీ కోర్ జంతువులు, పక్షులతో కూడిన ప్రత్యేక దళం కర్తవ్య పద్పై తొలిసారిగా కవాతు చేయబోతోంది. ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో జంతుదళం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో జంతుదళం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న భారత సైన్యంలోని రీమౌంటెడ్ వెటర్నరీ కోర్కి చెందిన జంతువులు, పక్షులతో కూడిన ప్రత్యేక దళం తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్లో కర్తవ్య పద్పై ప్రదర్శనకు సిద్ధమవుతోంది. ఆర్మీకి వివిధ సేవలు అందిస్తున్న జంతువులు, పక్షుల ప్రదర్శన ఈ పరేడ్లో భాగం కానుంది. ముఖ్యంగా లద్ధాఖ్ ప్రాంతంలో సైన్యానికి సేవలు అందిస్తున్న రెండు మూపురాల ఒంటెల ప్రదర్శన కూడా ప్రేక్షకులను అలరించనుంది. అశ్విక దళంతో పాటు వివిధ రకాల జాగీలాలు (కుక్కలు), రాబందులు కూడా సైన్యానికి సేవలందిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
