AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పురానాపూల్‌లో నీటమునిగిన శివాలయం.. వరదలో చిక్కుకున్న పూజారి కుటుంబం

పురానాపూల్‌లో నీటమునిగిన శివాలయం.. వరదలో చిక్కుకున్న పూజారి కుటుంబం

Phani CH
|

Updated on: Sep 28, 2025 | 9:46 PM

Share

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు హైద‌రాబాద్‌లోని మూసీ న‌ది ఉధృతంగా ప్రవ‌హిస్తోంది. పురానాపూల్ వ‌ద్ద మూసీ 13 అడుగుల మేర ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో పురానాపూల్ లో ఉన్న శివాల‌యం నీటమునిగింది. శివాలయంలోని ఓ పూజారి కుటుంబం వరదలో చిక్కుకుపోయింది. వ‌ర‌ద భారీగా పెర‌గ‌డంతో.. పూజారి కుటుంబం ఆల‌యంపైకి ఎక్కి సహాయం కోసం ఆర్తనాదాలు చేసింది.

ఘటనాస్థలికి చేరుకునన్న హైడ్రా, పోలీసులు, రెవెన్యూ అధికారులు పూజారి కుటుంబాన్ని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. మొత్తం న‌లుగురు వ్యక్తులు వ‌ర‌ద‌లో చిక్కుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మూసీకి వ‌ర‌ద పోటెత్తడంతో.. జియ‌గూడ – పురానాపూల్ 100 ఫీట్ల రోడ్డును మూసివేశారు. దీంతో అత్తాపూర్ – పురానాపూల్ మ‌ధ్య రాక‌పోక‌లు నిలిచిపోయాయి. పురానాపూల్ వ‌ద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. మూసీ పరివాహ‌క ప్రాంతాల ప్రజ‌ల‌ను పోలీసులు అప్రమ‌త్తం చేస్తున్నారు. అఫ్జ‌ల్ గంజ్ వ‌ద్ద ఉన్న మూసీ బాధితుల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించారు. మరోవైపు పురానాపూల్ శ్మశాన ఘాట్ కూడా వరదలో మునిగిపోయింది. స్మశాన ఘాట్‌లో ఉన్న వాహనాలు నీటమునిగాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సౌత్‌ ఇండస్ట్రీలో క్రేజీ సినిమాల క్యూ

కమ్‌ బ్యాక్‌ కోసం చూస్తున్న డైరెక్టర్స్‌

Pawan Kalyan’s OG Movie: పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లో రికార్డ్‌ బ్రేకింగ్‌ కలెక్షన్స్‌

Naveen Polishetty: ప్రమోషన్స్‌తో కుమ్మేస్తున్న నవీన్‌ పొలిశెట్టి

సినిమాల్లో మిస్‌ అవుతున్న సాంగ్స్‌