AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజమండ్రిలో గోదావరి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

రాజమండ్రిలో గోదావరి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

Phani CH
|

Updated on: Oct 03, 2025 | 7:49 AM

Share

రాజమండ్రిలో గోదావరి నది గంటగంటకు పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా, రెండో హెచ్చరికకు నీటి మట్టం చేరువలో ఉంది. 11 లక్షల క్యూసిక్‌లకు పైగా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లంక గ్రామాలు నీట మునగడంతో పంటలు, పశుగ్రాసంపై తీవ్ర ప్రభావం చూపుతోంది, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

రాజమండ్రిలో గోదావరి నదికి వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. అధికారులు దిగువకు దాదాపు 11 లక్షల క్యూసిక్‌లకు పైగా వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ చింతూరు నుంచి శబరి నది కూడా పొంగిపొర్లడంతో గోదావరి ఉధృతి పెరిగింది. వరదల కారణంగా లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యానవన పంటలు నీట మునిగిపోగా, పశువులకు పశుగ్రాసం దొరకడం లేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని టేకేసట్టిపాలెం, అప్పన్నరాముల లంక కాజువేలు కూడా మునిగిపోయాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విశాఖలో ఈదురుగాలుల బీభత్సం.. కూలిన చెట్లు, నేలకొరిగిన హోర్డింగ్‌లు